Monday, April 29, 2024

రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు తొలగించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరిపై ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ప్రసంగించారు. సభలో వాళ్లు 64 మంది ఉన్నారని, కానీ తాము 39 మంది సభ్యులం మాత్రమే ఉన్నామని, అధికార పక్షం వారు అడగగానే మైకు ఇస్తున్నారని, తమకు ఎందుకు ఇవ్వడంలేదని కెటిఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి బిఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు వాకౌట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News