- Advertisement -
అమరావతి: ఈ సంవత్సర కాలంలో..ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజార్చడంపై జగన్ మండిపడ్డారు. ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. చంద్రబాబు.. సిఎంగా దశాబ్ధాల అనుభవం ఉందని చెప్పుకునే మీకు ఆ అనుభవం ఏం నేర్పింది? అని ప్రశ్నించారు. వైయస్ఆర్ సిపి (YSRCP) ఐదేళ్ల హయంలో తీసుకున్న అప్పుల్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 44 శాతం తీసుకున్నారని చెప్పారు. కాగ్, మోస్పి సంస్థలు మీ అసమర్ధ, ఆర్థిక దుర్వినియోగాన్ని.. గణాంకాలతో సహా వాస్తవాలను వెల్లడించాయని జగన్ పేర్కొన్నారు.
- Advertisement -