కొలంబో: కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధమయ్యానని శ్రీలంక టి20 జట్టు సారథి లసిత్ మలింగ పేర్కొన్నాడు. భారత్తో జరిగిన సిరీస్ లో కెప్టెన్గా, బౌలర్గా తాను పూర్తిగా విఫలమయ్యానని, దీంతో కెప్టెన్సీలో కొనసాగే నైతిక హక్కు తనకు లేదన్నా డు. దీంతో కెప్టె న్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించాడు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ మలింగ ఈ విష యం చెప్పాడు. భారత్తో జరిగిన సిరీస్లో జట్టు ఓటమి తనను ఎంతో బాధించిందన్నాడు. సీనియర్ ఆటగాడిగా సిరీస్లో తన పాత్రకు న్యాయం చేయలేక పోయానని వాపోయాడు. రెండు మ్యాచుల్లో కలిసి కనీసం ఒక్క వికెట్ కూడా తీయక పోవడం ఆవేదనకు గురి చేసిందన్నాడు. సిరీస్లో జట్టు ఓటమికి తనదే పూర్తి బాధ్యతని, దీనిలో జట్టు సభ్యులను తప్పు పట్టడం మంచిది కాదన్నాడు. ఇక, కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మరి కొన్ని రోజుల పాటు టి20 జట్టులో కొనసాగుతానని మలింగ స్పష్టం చేశాడు.