Saturday, August 16, 2025

వాహనం ఢీకొని చిరుత మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో జరిగింది. చంద్రయాన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై చిరుత కళేబరం కనిపించడంతో వాహనదారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుతకు గాయాలు ఉండడంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News