Wednesday, April 24, 2024

పెరిగిన ఎల్‌ఐసి ఆదాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) మొత్తం ప్రీమియం రూ.4,74,005 కోట్లతో 10.9 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022 మార్చి ముగింపు నాటికి ఈ ప్రీమియం రూ.4,27,419 కోట్లుగా ఉంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 62.58 శాతం మార్కెట్ వాటాతో దేశీయ జీవిత బీమా వ్యాపారంలో ఎల్‌ఐసి అగ్రస్థానంలో ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ రూ.36,397 కోట్లు నమోదైంది. కంపెనీ బోర్డు షేరుకు రూ.3 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. 202223 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి వ్యక్తిగత విభాగంలో 2.04 కోట్ల పాలసీలను విక్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News