Thursday, April 25, 2024

ప్రేమ… ప్రియురాలు ఆత్మహత్య…. ప్రియుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాయకనూర్ గ్రామంలో వెంకటేష్-తమిళరసి అనే దంపతులు నివసిస్తున్నారు. వెంకటేష్ మేస్త్రీ పనులు చేస్తూ చిన్న కుమార్తె దమయంతిని(19) ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో చదివిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శ్రీనాథ్(25) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో యువతి ఇంట్లో ఉరేసుకుంది. శ్రీనాథ్ వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దమయంతి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. దమయంతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యువతి తల్లి నాయకనూర్ గ్రామానికి గతంలో ఉప సర్పంచ్ గా సేవలందించింది.

Also Read: పోలీస్ స్టేషన్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్‌ఐ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News