లక్నో: మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు బాలిక కలిసి ఆరుబయట పడుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బాలిక ఏడుపు వినిపించడంతో ఓ వృద్ధుడు ఆ దంపతులకు సమాచారం ఇచ్చాడు. 500 మీటర్ల దూరంలో బాలిక కనిపించడంతో లోకబంధు ఆస్పత్రికి తరలించారు.
బాలిక ప్రైవేటు పార్ట్స్ వద్ద గాయాలు ఉండడంతో అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాలు ఆధారంగా దీపక్ వర్మ అత్యాచారం చేసి ఉంటాడని గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని దేవి కేడా ప్రాంతంలో అతడు సంచరిస్తుండగా పోలీసులు లొంగిపోవాలని కోరారు. పోలీసులపై దీపక్ కాల్పులు జరపాడు. దీంతో నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.