- Advertisement -
కామారెడ్డి: తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్ పోస్టుపై ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజామున భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఎసిబి ప్రత్యేక బృందం సలాబత్ పూర్ చెక్ పోస్టులో రవాణా శాఖకు చెందిన అధికారులను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారుల పక్షాన పని చేస్తున్నఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. సుమారు 50 వేల రూపాయల నగదు లభ్యమైనట్లు సమాచారం.
- Advertisement -