Monday, April 29, 2024

డిసెంబర్ లోనే లోక్‌సభ ఎన్నికలు ఉండొచ్చు: మమతా

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగా బుక్ చేసుకొందని, మరోపార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన అని ఆమె వ్యాఖ్యానించారు. “పశ్చిమబెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి.

మూడోసారి బీజేపీ అధికారం లోకి వస్తే నిరంకుశ పాలనే ” అని ఆమె పేర్కొన్నారు. టిఎంసి యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. గవర్నర్ తీరుపై మండిపడ్డ ఆమె … ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ, ఆయన తీరు ఏమాత్రం బాగా లేదన్నారు. ఇటీవల జాదవ్ పూర్ యూనివర్శిటీలో చోటు చేసుకున్న వివాదంపైనా మమత స్పందించారు. గోలీ మారో అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News