Thursday, April 18, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం.. తరువాత ఏమైందంటే?

- Advertisement -
- Advertisement -

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై షేక్ సల్మాన్, అలియాస్ షేక్ అహ్మద్ (20) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి ముగ్గురు మిత్రులు సహకరించినట్లు సమాచారం. నిందితుడిని మదుబన్ కాలనీ వాసిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులను అత్యాచారానికి పాల్పడిన యువకుడి తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో వారు బాలిక కుటుంబీకులను బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News