Thursday, March 28, 2024

తెలంగాణలో బాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి చనిపోయిన వ్యక్తి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాన రాకడ, ప్రాణం పోకడ అన్నది ఎవరికీ తెలియదంటారు. జగిత్యాలలో శుక్రవారం ఇండోర్ స్టేడియంలో షటిల్ బాడ్మింటన్ ఆడుతున్న వ్యక్తి ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. జగిత్యాలకు చెందిన వెంకట్ రాజు(54) క్లబ్‌లో షటిల్ ఆడుతూ ఉన్నపళంగా నేలపై కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు వెంటనే అతడికి సిపిఆర్ చికిత్స చేశారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోగా వెంకట్ రాజు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన యావత్తు సిసిటివిలో రికార్డు అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News