Sunday, April 28, 2024

రైతుబంధుపై కాంగ్రెస్ ‘కుట్ర’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైతుబందుపై భారత ఎన్నికల కమిషన్‌కు ఎఐసిసి లేఖ రాసింది. రైతుబంధు స్కీంను ఆపాలని ఎఐసిసి ఇంఛార్జి మాణిక్‌రావ్ థాక్రే ఇసికి లేఖ రాశారు. రైతుల ఖాతాలో నగదు జమను ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్ర, రైతు సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుతంత్రం ఈ లేఖ ద్వారా బహిర్గతమైందని, కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతల మండిపడుతున్నారు. రైతుబంధుపై కాంగ్రెస్ అక్కసును బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది రైతులంతా కెసిఆర్ వెంట ఉన్నారనే కారణంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

లేఖలోకి వెళితే…
తెలంగాణలో రైతు బంధు, దళిత బంధు పథకాల లబ్ధిదారులకు ఆగ్రహం తెప్పించిన కాంగ్రెస్, రైతులు, దళితులకు లబ్ధి చేకూర్చే పథకాలకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంటూ, పథకాల కింద పంపిణీపై అభ్యంతరాలు లేవనెత్తుతూ భారత ఎన్నికల కమిషన్‌ని ఆశ్రయించింది. అసెంబ్లి ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కి ఇటువంటి పంపకాలు ప్రయోజనం చేకూరుస్తాయని ఇప్పటికీ భయపడుతున్నారు. రైతు బంధు పథకం కింద, వాననాకాలం (ఖరీఫ్) పంటకు జూన్ 2023లో నిధులు పంపిణీ పూర్తయింది. యాసంగి (రబీ) పంటకు పంపిణీ వచ్చే వారం ప్రారంభ మవ్వనుంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే, అంటే ఈ నెల మొదట్లో షెడ్యూల్ ప్రకటించకముందే ఇలాంటి పంపకాలు జరిపి ఉండాల్సిందని కాంగ్రెస్ వాదిస్తోంది.

ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో ఎఐసిసి తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే మోడల్ ప్రవర్తనా నియమావళి ప్రకటన తర్వాత ఈ పథకాల చట్టబద్ధతను కాంగ్రెస్ ప్రశ్నించడం లేదని సమర్థించారు. రైతు బంధు, దళిత బంధు రెండూ ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా కొనసాగుతున్న పథకాలే అయినప్పటికీ, రైతుబంధు పథకం కింద నగదు పంపిణీని నవంబర్ 3న నామినేషన్ దాఖలు చేసే తేదీలోపు లేదా పోలింగ్ తేదీ (నవంబర్ 30) తర్వాత నిర్వహించాలని కాంగ్రెస్ నేత వాదించారు. అదేవిధంగా దళితుల అభ్యున్నతికి ఉద్దేశించిన దళిత బంధు పథకం అమలుపై థాక్రే ఆందోళన చేపట్టారు. ఈ పథకం కింద పంపిణీ చేయడం వల్ల పాలక బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయవచ్చని అతను భయపడ్డాడు. అన్యాయమైన ఎన్నికల ప్రభావాన్ని నిరోధించడానికి భారత ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించాడు. ‘ఓటర్లపై ఇటువంటి ఎన్నికల తాయిలాలు చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని మేము నమ్ముతున్నాము‘ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ : హరీష్‌రావు
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మంత్రి హరీష్‌రావ్ ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్‌కు వెళ్లి రైతుబంధు పై పిర్యాదు చేశారని, ఎప్పటిలాగే ఇస్తున్న దానిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రైతు కడుపు కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ఆపాలని అంటున్న కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ. రైతులు ఆ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ పై విధంగా పేర్కొన్నారు.

ఇసి లేఖను ఉపసంహరించుకోవాలి : బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్
తీవ్ర ప్రతిస్పందనగా, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ ఇసికి క్రూరమైన లేఖ రాసిందని ‘పెట్టుబడిదారీ మనస్తత్వంతో నడిచే దాని హృదయరహిత, రైతు, పేద వ్యతిరేక వైఖరిని సిగ్గులేకుండా ప్రదర్శిస్తోందని‘ విమర్శించారు. చిల్లర రాజకీయాల కోసం రైతుల జీవనో పాధిని పణంగా పెట్టవద్దని, లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు. ఎన్నికలు రావచ్చు, పోవచ్చు, రైతులు వ్యవసాయాన్ని ఆపలేరు, రైతులను వేధించలేరు. మన రైతులు. బడుగు బలహీనవర్గాల సంక్షేమం, భవిష్యత్తును స్వార్థ రాజకీయ ప్రయో జనాల బలిపీఠం మీద ఎన్నటికీ బలి ఇవ్వకూడదు. మీ విభజన, వివక్ష రాజకీయాలను పక్కనబెట్టి మన రైతులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. రైతులను, పేదలను పట్టించుకోకుండా కేవలం వారి ఓట్ల కోసమే చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, నాయకుల అసలు రంగును తెలంగాణ ప్రజలు గుర్తించాలని శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. వారికి తగిన గుణపాఠం చెబుతాం’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News