Saturday, April 19, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 18 గంటల నుంచి 20 గంటల వరకు సమయం పడుతుంది.

ఇక, ఆదివారం తిరుమల వెంకన్నను 79,100 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,791 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.52 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News