Thursday, April 25, 2024

గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన మేయర్

- Advertisement -
- Advertisement -

Mayor Gadwal Vijayalakshmi planted the seedlings

హైదరాబాద్: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన పుట్టినరోజును పురస్కరించుకుని బంజారాహిల్స్ డివిజన్‌లోని ఎన్‌బిటినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసిమొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తన పుట్టిన రోజును విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు మాసన పుత్రిక హరితహరం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. హైదరాబాద్ నగరం లో కూడా జి హెచ్ ఎం సి అధ్వర్యంలో పచ్చదనం పెంపొందించేందుకు బడ్జెట్ లో ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేశామని మేయర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News