Sunday, April 28, 2024

మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలి

- Advertisement -
- Advertisement -

ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి
పెండింగ్ పనులపై దృష్టి సారించాలి
అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్

Medaram jatara story in Telugu

 

మనతెలంగాణ/హైదరాబాద్:  మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలని, ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు అధికారులకు సూచించారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పెండింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకొని, వాటిని ఈసారి అధిగమించేలా చూడాలని వారు సూచించారు. తాగునీటి, పారిశుద్ధ్యం, వసతితో పాటు ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాల న్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, భారీకేడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని వారు ఆదేశించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు

జాతరకు వచ్చే భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారుకిరువైపులా ఆర్ అండ్ బి అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు ప్రత్యేక కంట్రోల్రూం ఏర్పాటు చేసి సిసి కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలన్నారు.

జాతర అనంతరం చెత్త తొలగింపుపై…

మన ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చూస్తామో, జాతరకు వచ్చే భక్తులకు అలాంటి ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జనవరి 15వ తేదీ లోగా పనులు పూర్తయ్యేలా ఆధికారులు పని చేయాలన్నారు. మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు పరిశీలించారు. జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలను, షెడ్లను, ఇతర పనులను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News