Monday, April 29, 2024

ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్‌ను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. మెటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త యాప్‌పై పని చేస్తున్నారు. థ్రెడ్‌ను జూలై 6న ప్రారంభించనున్నారు.

యాప్ లాంచ్‌కు ముందే యాపిల్ స్టోర్‌లో కనిపించింది. రాబోయే థ్రెడ్‌లు టెక్ట్ ఆధారిత సంభాషణ యాప్‌గా ఉంటాయి. ట్విట్టర్‌లో అక్షర పరిమితి ఉన్నందున థ్రెడ్‌లో కూడా ఉంటుంది. యాప్ స్టోర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి థ్రెడ్‌లకు లాగిన్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసరించే వినియోగదారులు థ్రెడ్‌ను ఫాలో కావొచ్చని మెటా తెలిపింది. థ్రెడ్ యాప్ ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

మెటా ఈ ఏడాది జనవరి నుంచి ప్రాజెక్ట్ 92 కింద ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో జుకర్‌బర్గ్ కంపెనీ మెటా ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడంపై ప్రకటన చేసింది. దీని తర్వాత ట్విటర్‌ను అంతం చేయడానికి జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ పేరిట డైలీ మెయిల్ ఒక నివేదిక తెరపైకి తీసుకొచ్చింది. ఈ నివేదికను ట్విట్టర్‌లో షేర్ చేయడం ప్రారంభించారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, జుకర్‌బర్గ్‌కు కేజ్ ఫైట్‌కు సవాలు విసిరాడు, దానిని జుకర్‌బర్గ్ అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News