- Advertisement -
చంఢీగఢ్: ఐపిఎల్ 18వ సీజన్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్(GT), ముంబై ఇండియన్స్(MI) మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో ఆర్సిబి విజయం సాధించి ఫైనల్స్కు చేరింది. ఈ ఎలిమినేటర్లో గెలుపొందిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ముంబై మూడు మార్పులు చేసింది. బెయిర్స్టో, రాజ్ అంగద్ బావా జట్టులోకి రాగా.. గ్లీసన్ అరంగేట్రం చేస్తున్నాడు. గుజరాత్ కూడా జట్టులో రెండు మార్పులు చేసింది. బట్లర్ స్థానంలో మెండీస్, అర్షద్ స్థానంలో వాషింగ్టన్ జట్టులోకి వచ్చారు.
- Advertisement -