Tuesday, March 19, 2024

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నా అంత శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని, ఈ ఏడు కాలంతో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని చెప్పారు. మండుటెండల్లో చెక్ డ్యామ్ లు..వాగులు జల సిరులు చుస్తున్నామన్నారు. రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. ఈ శోభకృత్ సంవత్సరంలో అన్ని పాలద్రోలి అన్నింటా శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ  కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని మంత్రి హరీశ్ రావు కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News