Saturday, April 27, 2024

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

minister ktr comments on Vishwa Brahmins

హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఒక సమావేశంలో విశ్వబ్రాహ్మణనులను(చారీలను) తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఒక కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదన్నారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటను ఉపసంహరించుకుంటున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News