Thursday, April 25, 2024

అమెరికా నడిబొడ్డున తెలుగోడి ముద్ర

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ డిసిలో డబ్లూటిఐటిసి స్కై సోరర్ ఆవిష్కరించిన మంత్రి
కెటిఆర్ అమెరికా రాజధానిలో ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి
డబ్లూటిఐటిసి చైర్మన్ సందీప్ మఖ్తల, తెలుగు టెక్కీల మధ్య కోలాహలంగా కార్యక్రమం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడం లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (డబ్లూటిఐటిసి)- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మం డలి అగ్రరాజ్యం అమెరికాలో తనదైన ముద్ర వేసుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డిసిలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ స్కై సోరర్ ను కెటిఆర్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ సంస్థలు మాతృభూ మి అభివృద్ధిలో భాగం చేయాలని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలిని ఏర్పాటు చేసిన చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఫ్లైయింగ్ హై విత్ డబ్లూటిఐటిసి అనే థీమ్‌తో రూపొందించి ఈ స్కై సోరర్ ద్వారా డబ్లూటిఐటిసి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయనున్నారు.

సింగపూర్‌లో ఆగస్టు 5,6 తేదీల్లో …
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఏర్పడిన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (డబ్లూటిఐటిసి) తెలుగు రాష్ట్రాల్లోకి పెట్టుబడులు తీసుకురావడం, ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వివిధ భాగస్వామ్య పక్షా ల మధ్య సమన్వయం లక్ష్యంగా కృషి చేస్తోంది. వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ చైర్మన్ సందీప్ మఖ్తల ఈ మేరకు ఇప్పటికే మలేసియా, సింగపూర్, యూ ఏఈ, ఒమన్ తదితర దేశాల్లో ఆయన పర్యటించా రు. దీనికి కొనసాగింపుగా ప్రస్తుత పర్యటనలో షి కాగో, డలాస్, వాషింగ్టన్ డీసీ, ఆస్టిన్, శాన్ అంటానియో, ఎస్‌ఎఫ్‌ఓ, సిలికాన్ వ్యాలీ నగరాలతో పా టుగా కెనడా, మెక్సికిలోని పలు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు.

సింగపూర్‌లో ఆగస్టు 5,6 తేదీల్లో జరగబోయే ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ సన్నాహక వేదికగా చేపడుతున్న కార్యక్రమా ల్లో భాగంగా ఆయా దేశాల్లో పర్యటిస్తూ టెక్కీలను అనుసంధానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, డిజిటల్ మీ డియా డైరెక్టర్ దిలీప్ కొనతం, విశ్వేశ్వర్ కాల్వల, వెంకట్ మంతెన, లక్స్ చేపురి,డబ్లూటిఐటిసి కౌన్సిల్ సభ్యులు రమేష్ గౌడ్ చనగోని, ధర్మేంద్ర బొచ్చు, విజయ స్పందన, కరుణ, నిరంజన్, కిరణ్ మీగడ, రోనిత్ బండ, సూర్య విడియల, సాత్విక్, హరి, కృష్ణలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News