Friday, March 29, 2024

దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Niranjan Reddy Fires on bjp government

హైదరాబాద్: రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడో రోజు 10,78,634 మంది రైతుల ఖాతాలలో రైతుబంధు రూ.1312.46 కోట్లు జమ చేశామన్నారు. మూడు రోజులలో 47,09,219 రైతుల ఖాతాలలో రూ.3133.21 కోట్లు జమ జమైనట్లు వివరించారు. ఈ దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యధిక శాతం మంది ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగానికి చేయూత ఇవ్వాలన్న ముందుచూపు కేంద్రంలోని బీజేపీ పాలకులకు కొరవడిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ తెగనమ్ముతూ ఆఖరుకు ఆహారరంగాన్ని కూడా కార్పోరేట్ల పరం చేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలపై రైతులు పట్టుదలతో పోరాడడంతో జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల పట్ల రాష్ట్ర బీజేపీ నేతలది మొసలికన్నీరు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఎందుకు రాదు..? వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు మార్చి కేంద్రం రైతుల గొంతుకోయాలని చూస్తున్నదన్నారు.

మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో దివాళా తీసిందని ఆరోపించారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో కేంద్రం ఏమిచ్చింది ? బీజేపీ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ప్రధానమంత్రి మోడీ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఏ రంగంలో విజయం సాధించారని విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారు ? జీఎస్టీతో చిన్న వ్యాపారుల పొట్టకొట్టి రాష్ట్రాల ఆదాయం ఎత్తుకెల్లినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతుల పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని పేదలను మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? నల్లధనం తెస్తానని దేశ ప్రజలను మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? కరోనా కష్టకాలంలో వలస కూలీలను, పేదలను, వారి ప్రాణాలను గాలికి వదిలేసి చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? కరోనా విపత్తులో ఆఖరుకు ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకుండా చేసి పేదల ప్రాణాలను పణంగా పెట్టినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

దేశంలో పేదల రుణాలపై వడ్డీ భారం మోపుతూ కార్పోరేట్ల రుణాలు 11 లక్షల కోట్లు మాఫీ చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? నల్లచట్టాలు తెచ్చి.. రైతులను రోడ్ల మీదకు తెచ్చి 700 మంది ప్రాణాలను బలిగొన్నందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? ఉపాధిహామీకి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి రైతులను మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? ఎరువుల ధరలు పెంచి సబ్సిడీలను ఎత్తేసి రైతుల నెత్తిన భారం మోపుతున్నందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి వాటి ధరలను ఎనిమిదేళ్లలో రెట్టింపు చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ?67 ఏండ్లలో 54 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎనిమిదేండ్లలో వందలక్షల కోట్లు అప్పు చేసి రూ.154 లక్షల కోట్ల అప్పు దేశం నెత్తిన పెట్టినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ?దేశం ప్రశ్నిస్తున్నది .. ప్రధాని మోడీ సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News