Saturday, June 14, 2025

స్థానిక సమరంపై పది రోజుల్లో స్పష్టత

- Advertisement -
- Advertisement -

తొలుత సర్పంచ్ ఎన్నికలు.. ఆ
తరువాతే ఎంపిటిసి, జడ్‌పిటిసి
ఎన్నికలు పార్టీశ్రేణులు సిద్ధంగా
ఉండాలి కాంగ్రెస్ కార్యకర్తల
సమావేశంలో మంత్రి సీతక్క

మన తెలంగాణ/కొత్తగూడ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై వారం, పది రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని పంచాయతీరాజ్, గ్రా మీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి కొత్తగూడ, గంగారం మండల్లాలో త్వరలో జరిగే సర్పం చ్, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో మనమే గెలవాలనీ దిశా నిర్దేశం చేశారు. మొదటగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సీతక్క అన్నారు.

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయని అన్నారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చే నాటికి మండల నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసు కెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు లావణ్య వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News