Friday, April 19, 2024

కోనేరులో గల్లంతైన మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయం సమీపంలోని శివాలయం వద్ద గల కోనేరులో హైదరాబాద్ శాలిబండకు చెందిన నైక్ సంజయ్ (35) ఆదివారం గల్లంతయ్యాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ప్రియానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై హరీష్‌శంకర్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News