Saturday, April 20, 2024

బిసి గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి గురుకుల ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను బిసి సoక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బిసి సoక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి డా.మల్లయ్య బట్టు పాల్గొన్నారు.ఈ ఫలితాలలో ఎంపిసిలో 150 మార్కులకుగాను 122 మార్కులతో మొదటి స్థానంలో సిద్దిపేట్ జిల్లాకు చెందిన కుమారి పి. జ్యోత్స,

బైపిసిలో నల్గొండ జిల్లాకు చెందిన పి. శ్రీవల్లి 108 మార్కులతో, సిఇసిలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసిలో, మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ. అర్చన 109 మార్కులతో అగ్ర స్థానంలో నిలిచారు. జూన్ 1 నుండి జూన్ 10వ తేదీ వరకు కేటాయించిన కాలేజీలలో చేరాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఫలితాలను https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని సంస్థ కార్యదర్శి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News