- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.50లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కౌశిక్రెడ్డిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్రెడ్డిని కోర్టులో సుబేదారి పోలీసులు హాజరుపర్చనున్నారు. దీంతో సుబేదారి పోలీస్స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిఎస్ ఎదుట బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆందోళనకు దిగారు. పోలీసులు, బిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
- Advertisement -