Sunday, April 28, 2024

కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే బతుకమ్మ పండగను కవిత భ్రష్టు పట్టిస్తారని మండిపడ్డారు. ఎంపిగా ఐదేళ్లు పదవిలో ఉండి చక్కర ఫ్యాక్టరీ మూయించారని విమర్శించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడని జీవన్ రెడ్డి వెల్లడించారు. రాహుల్ గాంధీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో నేతలు ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గురువారం జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News