Tuesday, April 30, 2024

గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ఆదివారం పరామర్శించారు. ఈ నెల 27న గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు గుండెపోటుతో హైదరాబాద్‌ కాంటినెంటల్ ఆస్పత్రిలో మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(34) మృతిచెందాడు. విష్ణువర్ధన్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం సాయంత్రం పటాన్‌చెరు సమీపంలో నిర్వహించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలువురు బిఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News