Tuesday, April 30, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తు తెలియని వావానం బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు కృష్ణాజిల్లా ఏ కొండూరు మండలం చీమలపాడు వాసులు చీపు బాలకృష్ణ కుటుంబంగా  పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News