Saturday, April 27, 2024

గుత్తా పొద్దు తిరుగుడు పువ్వు, ఊసరవెల్లి : ఎంపి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: వ్యవసాయానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 24 ఉచిత విద్యుత్తు సరఫరా కావడం లేదని, 11 గంటలకన్నా ఎక్కువ రావడం లేదని తాను బండసోమారం సబ్ స్టేషన్ నుంచి చెప్పిన మాటలతో బెదిరిపోయిన ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 350 సబ్ స్టేషన్ల నుంచి లాగ్‌బుక్స్ గుంజుకెళ్లిందని, వాటిని ప్రగతి భవన్‌కు తరలించారని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 24గంటల విద్యుత్తు సరఫరా కావడం లేదని తాను నిరూపించడంతో మంత్రి కెటిఆర్‌కు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పరేషాన్‌లో ఉండని ఎద్దేవాచేశారు. నల్లగొండ, సిరిసిల్ల ఎక్కడైనా ఉచిత విద్యుత్‌పై చర్చకు కెటిఆర్ రావాలని సవాల్ విసురుతున్నానన్నారు.

పొద్దుతిరుగుడు పువ్వులా పూటకో పార్టీ మారే వారి గ్రామంలో కూడా తాను సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశానంటు పరోక్షంగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించారు. ఊసరవెల్లి రంగులు మారినట్లుగా మూడు పార్టీలు మారిన గుత్తా నాకు వ్యవసాయం తెలియదంటారా అంటు వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని, మేము చేసేదే చెప్తామని, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. కొల్లాపూర్‌లో ఈనెల 20న జరిగే కాంగ్రెస్ సభలో ప్రియాంంకా గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారని, త్వరలోనే బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వికలాంగులకు 5 వేల పెన్షన్ ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News