Sunday, June 1, 2025

గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 229

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 2025 ప్లే ఆఫ్స్ లో భాగంగా ముల్లాన్ పూర్ వేదికగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్(GT), ముంబయి ఇండియన్స్(MI) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్లలో రోహిత్ శర్మ(81;50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లు) దంచి కొట్టాడు. బెయిర్ స్టో (47;22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు ) రాణించాడు. తిలక్ వర్మ(25), సూర్య కుమార్ యాదవ్(33), హార్థిక్ పాండ్య(22; 9 బంతుల్లో 3 సిక్స్ లు) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ క్రిష్ణ 2, సాయి కిషోర్ 2 , సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News