- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబయి ఇండియన్స్ గెలుపొందింది. గుజరాత్పై ముంబయి 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లో రికార్డు సృష్టించింది. రెండు జట్లు కలిపి 436 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. దీంతో పంజాబ్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో 428 పరుగులే అత్యధికం. ప్లేఆఫ్స్లో ముంబయి పది మ్యాచుల్లో తొమ్మిది గెలిచి ఒక్కసారి మాత్రమే ఓటమిని చవిచూసింది. ఈ ఐపిఎల్లో రోహిత్ శర్మ నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన మ్యాచ్లు టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 81 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపిఎల్లో 300 సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఐపిఎల్లో రోహిత్ ఏడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఈ ఐపిఎల్లో 759 పరుగులతో సాయి సుదర్శన్ తొలి స్థానంలో ఉన్నాడు.
- Advertisement -