Sunday, June 1, 2025

ముంబయి బౌలింగ్ అద్భుతం… తనివి తీరా చూడాల్సిందే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్ గెలుపొందింది. గుజరాత్‌పై ముంబయి 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్ ముందు 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ఓడిపోయింది. ముంబయి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ ఔట్ కావడం అనేది మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. 13.3 ఓవర్లకు గుజరాత్ జట్టు 151 పరుగులతో పటిష్టంగా ఉంది. బుమ్రా అద్భుతమైన బంతితో వాషింగ్టన్ సుందర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 15.3 ఓవర్ల వద్ద గ్లీసెన్ యార్కర్ సంధించడంతో సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయాడు. రెండు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడంతో ముంబయి అభిమానులు ఆనందంలో తేలిపోయారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News