Friday, April 26, 2024

మార్చిలో ఆలైటైమ్ హైకి చేరిన మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు…

- Advertisement -
- Advertisement -

 

తొలిసారిగా రూ.14,000 కోట్లు
మార్చిలో ఆలైటైమ్ హైకి చేరిన మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు

న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈమేరకు ఎఎంఎఫ్‌ఐ(అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) మార్చి డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, మార్కెట్‌లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా నెలవారీ పెట్టుబడి మార్చిలో తొలిసారిగా రూ.14,000 కోట్ల మార్కును దాటింది. ఇది కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌ఫ్లో 31 శాతం ఎక్కువగా ఉంది.
ఫిబ్రవరి నెలలో సిప్ ఇన్‌ఫ్లో రూ.13,686 కోట్లు కాగా, మార్చి నెలలో రూ.14,276 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో నికర డెట్ ఫండ్ ఔట్ ఫ్లో 311 శాతం పెరిగి రూ.13,815 కోట్ల నుంచి రూ.56,884 కోట్లకు చేరింది. లార్జ్ క్యాప్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లు ఈక్విటీ ఫండ్స్‌లోకి పెద్ద సంఖ్యలో ఇన్‌ఫ్లోలకు బాధ్యత వహించవచ్చు.

ఈ ఫండ్స్‌లో అత్యధిక ఇన్‌ఫ్లో

ఫిబ్రవరి నెలలో లార్జ్ క్యాప్స్‌లో ఇన్‌ఫ్లో రూ.353 కోట్లు కాగా, మార్చిలో రూ.911 కోట్లుగా ఉంది. డివిడెండ్ ఈల్డ్ ఫండ్ ఫిబ్రవరిలో రూ.47.9 కోట్లు కాగా, మార్చి నెలలో రూ.3,715 కోట్లుగా ఉంది. అదేవిధంగా ఇఎల్‌ఎస్‌ఎస్ నిధులు రూ.981 కోట్ల ఇన్‌ఫ్లోను చూడగా, రూ.2,685 కోట్లు వచ్చాయి. ఇది కాకుండా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లు కూడా ఫిబ్రవరిలో రూ. 6,244 కోట్ల నుంచి మార్చిలో రూ. 27,228 కోట్లకు 336 శాతం వృద్ధితో తమ నికర ఇన్‌ఫ్లోలను భారీగా పెంచాయి.

Also Read: 13 ప్రాంతీయ భాషల్లోనూ సిఎపిఎఫ్ పరీక్ష

సిప్ సంఖ్య రెట్టింపు

2020 మార్చిలో కేవలం 3 కోట్ల సిప్ ఖాతాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఖాతాలు రెండింతలు పెరిగాయి. ప్రస్తుతం మొత్తం రిజిస్టర్డ్ ఖాతా 6.4 కోట్లు, దీనిలో 2023 మార్చిలో మొత్తం 22 లక్షల ఖాతాలు పెరిగాయి. మార్చి నెలలో ఓపెన్-ఎండ్ స్కీమ్‌ల 24 కొత్త ఫండ్ ఆఫర్‌లు, 21 క్లోజ్డ్- ఎండ్ స్కీమ్‌లు కూడా ప్రారంభించారు.

2 లక్షల కోట్ల నికర ఇన్ ఫ్లో

2022-23 కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూ. 2 లక్షల కోట్ల నికర ఇన్‌ఫ్లోను చూసాయని డేటా చూపిస్తుంది. కార్పొరేట్ బాండ్ పథకాలలో 15,600 కోట్లు, బ్యాంకింగ్, పిఎస్‌యులలో రూ.6,500 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్‌లలో రూ.5,661 కోట్లు వచ్చాయి. డెట్ ఫండ్ పథకాల్లో లిక్విడ్ ఫండ్స్‌లో గరిష్టంగా రూ.56,924 కోట్ల ప్రవాహం ఉంది. దీని తర్వాత మనీ మార్కెట్ ఫండ్ రూ.11,421 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News