Sunday, April 28, 2024

సతీశ్ వేగేశ్న ‘కథా కేళి’ షూటింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

సతీశ్ వేగేశ్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఆయన ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు చేయగా.. అది ఎంతగానో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్రయూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక చివరి రోజున ఇలా చిత్రయూనిట్ అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ అంతా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌.కె.బాల‌చంద్ర‌న్‌ సంగీతం అందిస్తున్నారు. దాము న‌ర్రావుల‌ కెమెరామెన్‌గా, మ‌ధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News