Sunday, April 28, 2024

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఎ

- Advertisement -
- Advertisement -

బెంగుళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో సంబంధమున్న ఓ వ్యక్తిని జాతీయ దర్సాప్తు సంస్థ అరెస్టు చేసింది. కర్నాటకలోని బళ్లారిలో బుధవారం షబ్బీర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మార్చి 1వ తేదీన బెంగళూరులో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి బ్యాగులో ఎల్ఇడి తీసుకువచ్చి కేఫ్ వద్ద ఉంచి బ్లాస్ట్ చేశాడు. ఈ ఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు గ్రూపులుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.పలు ప్రదేశాల్లోని సిసిటివిలో రికార్డు అయిన నిందితుడి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధమున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఎ వర్గాలు వెల్లడించాయి. అయితే, అధికారులు అరెస్టు చేసింది.. సిసిటీవిలో కనిపించిన వ్యక్తేనా లేక మరో నిందితుడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News