Thursday, March 28, 2024

ఆరు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , ఉగ్రవాదం, గ్యాంగ్‌స్టర్ల కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం ఉదయం ఆరు రాష్ట్రాల్లో సోదాలు ప్రారంభించింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దాదాపు 100 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు విదేశాల్లోని తమ సానుభూతిపరులతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో హత్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఎన్‌ఐఎ గత ఏడాది కేసులను నమోదు చేసింది. ఈ గ్యాంగులు ఆయుధాలు, మందుగుండు, ఐఈడీలు వంటి వాటిని రవాణా చేస్తున్నట్టు వెల్లడైంది. ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News