అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు రక్షణ లేదని మాజీ మంత్రి రోజా తెలిపారు. అధికారంలో ఉన్నవాళ్లే అరాచకాలు చేస్తున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంగళవారం రోజా మీడియాతో మాట్లాడారు. మహిళలపై దాడులు జరుగుతుంటే పవన్ స్పందించడం లేదన్నారు. హామీలు వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రెడ్బుక్ పేరిట అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై దాడులు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టించుకోవలేదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసు రావుపై తప్పుడు కేసు అరెస్ట్ చేశారని రోజా ధ్వజమెత్తారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్షగట్టారని, అందుకే అరెస్ట్ చేశారని విమర్శించారు. జూన్ 6న డిస్కషన్ జరిగితే కొమ్మినేని క్షమాపణలు చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లే మంత్రి నారా లోకేష్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, మూర్తి రేణుకా చౌదరి, బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలపై ఎందుకు కేసు పెట్టలేదని రోజా ప్రశ్నించారు.
ఎపిలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: రోజా
- Advertisement -
- Advertisement -
- Advertisement -