Tuesday, April 23, 2024

రాహుల్ గాంధీని విమర్శించిన హేమా మాలిని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి పార్లమెంటు సభ్యురాలు హేమా మాలిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ‘మరో దేశంలో ఇండియాకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం మంచిది కాదు’ అని ఆమె ఓ వార్తా సంస్థకు తెలిపింది.

“మన ప్రధాని ప్రపంచమంతటా భారత్‌కు పేరు తెచ్చేందుకు బాగా కష్టపడ్డారు. విదేశంలో భారత్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడడం బాగాలేదు. ఏది ఏమైనప్పటికీ వారు విషయాన్ని పార్లమెంటులోనే పరిష్కరించుకోవాలి, విదేశాల్లో కాదు’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News