Monday, June 30, 2025

ముక్కోణపు పోరు

- Advertisement -
- Advertisement -

అనూహ్యంగా తెరపైకి మాజీ ఎంఎల్‌సి
రామచందర్‌రావు పేరు మహిళా
కోటాలో డికె అరుణ నేనూ
నామినేషన్ వేస్తానంటున్న రాజాసింగ్
రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్
జారీ నేడు నామినేషన్ల స్వీకరణ,
ఉపసంహరణ రేపు కొత్త అధ్యక్షుడి
ప్రకటన రాష్ట్రానికి చేరుకున్న సునీల్
బన్సల్, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే
ఏకగ్రీవం దిశగా నాయకత్వం చర్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ పార్టీ మా జీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఈ మేరకు ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి నుం చి ఈ నెల 30 సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నాం రెండు గంటల నుంచి సాయంత్రం నాలు గు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, త ర్వాత నాలుగు గంటల నుంచి ఐదు గం టల వరకు నామినేషన్ల ఉప సంహరణ జ రుగుతుందని ఆయన ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్రమంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారని తెలిపా రు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలోనే ఈ సం స్థాగత ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఆదివారం సాయం త్రం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎన్నికపై సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, పలు జిల్లాల అధ్యక్షులతో పాటు ముఖ్యనాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

అధ్యక్ష పదవి రేసులో ఈటల, లక్ష్మణ్, అర్వింద్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ అనేది ఆ పార్టీ జాతీయ నాయకత్వం రూపొందించుకున్న నియమావళిని అనుసరించి సాధారణంగా జరుగుతుంది. అయితే అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే అంశం ఇప్పటికే పార్టీ ఓ నిర్ణయం తీసుకుంది. అంతర్గతంగా ఈ నిర్ణయం తీసుకున్నా చివరి నిమిషం వరకు వెల్లడించే అవకాశం లేదు. రాష్ట్ర కమల సారధి నిర్ణయం జరిగిపోయిందని, ఇక ప్రకటించడమే తరువాయి అని పార్టీ నుంచి లీకులు ఇస్తున్నారు. పార్టీలో అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉండడం, ఆశావహులు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఏకగ్రీవం చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం మరో వైపు రంగంలో దిగి ప్రయత్నిస్తోంది. పార్టీ ఎవరికి హామీ ఇచ్చిందో వారు మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తారు. మిగిలిన వారు దాఖలు చేయరు. ఆ విధంగా ఒక్క నామినేషన్ మాత్రమే పార్టీ ఎన్నికల అధికారి ముందు ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఆ ఒక్కరినే ప్రకటించడంతో ఎన్నిక పూర్తవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని భావించిన బీజేపీ నాయకత్వం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని దాదాపు తేలిపోయింది. ఈ రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, డాక్టర్ కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ప్రధానంగా ఉన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో పురంద్రీశ్వరికి మహిళా కోటాలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన మాదిరిగా తెలంగాణలో మహిళకు అవకాశం ఇస్తే తనకు ఇవ్వాలని పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ కూడా ఆశిస్తున్నారు. ఈ నలుగురి మధ్యలో ఎవరిని కమల దళ నేత పదవి వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. బిసి వర్గానికి చెందిన ఈటల పేరు దాదాపు ఖరారైందని ఇప్పటికే వినిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కుటుంబ సమేతంగా కలిసి వచ్చారు. దీంతో ఆయన పేరే ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా తన వంతు ప్రయత్నంగా ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పారు. మరోవైపు తమకూ అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, తల్లోజు ఆచారి అధిష్టానాన్ని ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బిసి వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందనే కోణంలో నిర్ణయం తీసుకుంటే- ముందుగా ఈటల, ఆ తర్వాత లక్ష్మణ్, అర్వింద్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీని అధికారంలోకి తెస్తా: రాజాసింగ్
‘కార్యకర్తల అభీష్టం మేరకు తాను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తా, నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తరహాలో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తా’నని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి పడితే వారికి ఛాన్స్ ఇవ్వొద్దని, కొత్త అధ్యక్షుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కావాలని సూచించారు. తనను అధ్యక్షుడు కాకుండా ఓ వర్గం అడ్డుకుంటుందని అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కార్యకర్తల అభీష్టం మేరకు సోమవారం నామినేషన్ వేస్తానని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News