Friday, April 19, 2024

బైక్ ను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కారు, ద్విచక్ర వాహనం ఢీ: ఒకరు మృతి

One Members dead in Car collided bike

మనతెలంగాణ/గోవిందరావుపేట:  కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావు మండలంలోని పస్రా గ్రామ సమీపంలోని గుండ్లవాగు అటవీశాఖ నర్సరీ ప్రాంతంలో 163 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక పస్రా పోలీస్‌స్టేషన్ ఎస్సై కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… నర్సంపేట ప్రాంతానికి చెందిన రాపోలు శ్రీకాంత్(25) తన షైన్ ద్విచక్రవాహనంపై కాటాపూర్‌లో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన మద్యం వ్యాపారి కార్తీక్‌రెడ్డికి చెందిన బెలినో కారు తాడ్వాయి వైపు నుండి గోవిందరావుపేట వస్తుంది. అయితే 163 జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్ కరుణాకర్‌రావు తెలిపారు. కాగా మృతుడికి భార్యతో పాటు మూడేండ్ల కూతురు, 8 నెలల కుమారుడు ఉన్నాడు. మృతుని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News