Sunday, June 15, 2025

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన హార్స్ రైడర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

జమ్ముకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా భార్య గుల్నాజ్ అక్తర్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ఉగ్రవాదులతో విరోచితంగా పోరాడిన ఆదిల్ భార్యకు మత్స్య శాఖలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శనివారం అనంత్‌నాగ్ జిల్లా హపత్నార్ ప్రాంతంలోని హుస్సేన్ షా ఇంటికి వెళ్లి, ఆయన భార్య గుల్నాజ్ అక్తర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నియామక లేఖను అందజేశారు. ఆదిల్ హుస్సేన్ షా పరాక్రమానికి ప్రభుత్వం తరపున కృతజ్ఞతగా ఉద్యోగం కల్పించినట్లు ఆయన తెలిపారు. కాగా, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూరు పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాదులతో సహా మొత్తం 100 మంది మృతి చెందినట్లు భారత సైన్యం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News