Saturday, April 20, 2024

పాక్ లక్ష్యం 153

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా సెమీఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. పాకిస్థాన్ ముందు 153 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. డార్లీ మిచెల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. మిచెల్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కెప్టెన్ కెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో డెవన్ కాన్వే(21), జెమ్స్ నీశమ్(16 నాటౌట్) గ్లెన్ పిలీప్స్(08), ఫిన్ అలెన్(04) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షహిన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా మహ్మాద్ నవాజ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News