Saturday, July 27, 2024

కొండవీడు కోట అభవృద్ధి, కేంద్రీయ విద్యాలయం ఏమైంది: పత్తిపాటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: కొండవీడు కోట అభవృద్ధి, కేంద్రీయ విద్యాలయం ఏమైందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. 98 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను ఐదేళ్లుగా ఎందుకివ్వలేదని అడిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న కాలనీల పేరిట రూ. 50 కోట్లు కొట్టేసిందెవరు అని చురకలంటించారు. యడ్లపాటు మండల రహదారులపై సిఎం జగన్ మోహన్ రెడ్డి తిరగగలరా? అని దుమ్మెత్తిపోశారు. చిలకలూరిపేట సభలో సిఎం జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. టిడిపి ప్రభుత్వంలో రోడ్లు అందంలా ఉండేవని, అప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్లన్నీ నిర్మించకుండా ఉండడంతో గుంతలమయంగా మారాయని పుల్లారావు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News