Thursday, April 25, 2024

చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది: పవన్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: అసెంబ్లీలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చట్ట సభల గౌరవాన్ని హుందాతనాన్ని పరిరక్షించాలన్నారు. చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సిఎం జగన్ మోహన్ రెడ్డిపై ఉంటుందని, ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టిడిపి సభ్యులు గందరగోళం సృష్టించారు. స్పీపర్ తమ్మినేని సీతారామ్‌పై టిడిపి సభ్యులు దూసుకెళ్లారు. పేపర్లు చింపి స్పీకర్ ముఖంపై విసిరేశారు. ఎపి అసెంబ్లీలో టిడిపి ఎంఎల్‌ఎలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై జరిగిన దాడిని టిడిపి నేతలు ఖండించారు. శాసన సభలో వైసిపి ఎంఎల్‌ఎలు సుధాకర్ బాబు, ఎలీజా తనపై దాడి చేసిరని బుచ్చయ్య చౌదరి, వీరాంజనేయ స్వామి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శాసన సభలో దాడుల సంస్కృతి మంచిది కాదని హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News