Saturday, July 27, 2024

ప్రజల డేటా ఎక్కడ భద్రపరుస్తున్నారు జగన్: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో డేటా చౌర్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను జత చేశారు. ప్రజల వ్యక్తిగత వివరాలు ప్రైవేటీ వ్యక్తి దగ్గర ఉంటే క్రైమ్ అని గతంలో జగన్ అన్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. మై డియర్ వాట్సప్ అంటూ జగన్‌ను పవన్ సంభోదించారు. జగన్ సిఎంగా ఉన్న లేకున్నా డేటా ప్రైవసీ చట్టాలు అలాగే ఉంటాయన్నారు. వాలంటీర్ వ్యవస్థకు బాస్ ఎవరూ? అని ప్రశ్నించారు. ప్రజల డేటా ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. వ్యక్తిగత డేటా సేకరించే విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారని? పవన్ కల్యాణ్ నిలదీశారు.

Also Read: అమ్మ కోసం దుబాయ్ నుంచి సూట్‌కేసులో టమాటాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News