Tuesday, April 30, 2024

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి

- Advertisement -
- Advertisement -

కాసిపేటః కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధిహామి పనులు నిర్వహిస్తున్న కూలీలపై తేనేటీగలు దాడి చేయడంతో సూమారు 15 మంది ఉపాధి కూలీలు గాయపడ్డారు. ముత్యంపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉపాధి కూలీలు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వచ్చిన తేనేటీగలు ఉపాధి కూలీలపై దాడులు చేయడంతో వారు పరుగులు తీసారు. తేనేటీగల దాడిలో గాయపడిన కూలీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. కూలీలలు ఎక్కువ మందికి ముఖంపై, వీపుపై గాయాలు ఆయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News