ఐపిఎల్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రతీ క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారా? ఎవరు తొలిసారి ట్రోఫీని అందుకుంటారా? అని ప్రస్తుతం సర్వత్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. కానీ, ఈ మ్యాచ్కి ముందు ఆర్సిబి జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్లో ఆడుతాడా లేదా అని కన్య్ఫూజన్ ఉన్న సమయంలో.. జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt, RCB) కూడా ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.
ఫిల్ సాల్ట్ (Phil Salt, RCB)భార్య మొదటి బిడ్డకు జన్మనిస్తున్న తరుణంలో అతను ఇంగ్లండ్కు వెళ్లలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఫైనల్కు ముందు రోజు ఆర్సిబి ప్రాక్టీస్ సెషన్లోనూ అతను పాల్గొనలేదు. ఈ విషయాన్ని ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. పంజాబ్తో మ్యాచ్ కోసం ఫిల్ సాల్ట్ అహ్మదాబాద్ చేరుకోలేదని.. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో అతను ఇంగ్లండ్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్సిబి మేనేజ్మెంట్కి అతను ముందే తెలియజేశాడని తెలిపింది. ఇదే నిజమైతే.. ఆర్సిబికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఓపెనర్గా ఫిల్ సాల్ట్ ఆర్సిబికి మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. అతను లేకపోతే అతని స్థానంలో కివీస్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.