Monday, June 30, 2025

భద్రాద్రి గిరిజనంపై ప్రధాని ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా గిరిజన మహిళలు శ్రమ గురించి ప్రస్తావించడంతో వారి ఘనత జాతీయ స్థా యిలో మార్మోగినట్లయింది. భద్రాచలం పట్టణంలో శ్రీరామ జాయిం ట్ లయబిలిటీ గ్రూపు, శ్రీలక్ష్మీగణపతి జాయింట్ లయబిలిటీ గ్రూ ప్, దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు తయారుచేసే మిల్లెట్ బిస్కెట్ల ఘనత గురించి మోడీ  ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు. మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. “నా ప్రియమైన దేశప్రజలారా..

మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రం భారతదేశానికి కొత్త భవిష్యత్తును సృష్టించడానికి సిద్ధంగా ఉంది.. మన తల్లులు, సోదరీమణులు, అమ్మాయిలు నేడు తమకే కాకుండా మొత్తం సమాజానికి కొత్త దిశను సృష్టిస్తున్నారు…తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీరు కూడా సంతోషిస్తారు. ఈ మహిళలు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు. వారు తమ జీవనోపాధి కోసం రోజంతా కష్టపడి పనిచేసేవారు. నేడు ఆ మహిళలు చిరుధాన్యాలు నుండి మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్ దాకా ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరుతో వెళ్తున్నాయి. భద్రాచలం మహిళలు స్వయం సహాయక బృందంతో అనుసంధానమై శిక్షణ పొందారు. మిత్రులారా! ఈ మహిళలు మరో ప్రశంసనీయమైన పని చేశారు. వారు గిరి శానిటరీ ప్యాడ్లు తయారు చేయడం ప్రారంభించారు. కేవలం మూడు నెలల్లో వారు 40,000 ప్యాడ్‌లను తయారు చేసి పాఠశాలలు, సమీపంలోని కార్యాలయాలకు పంపిణీ చేశారు. అది కూడా చాలా సరసమైన ధరకు’ అంటూ భద్రాద్రి మహిళల ఘనతను ప్రశంసిస్తూ ఆయా మహిళలకు అభినందనలు తెలిపారు.

భద్రాద్రి గిరిజన మహిళలు మిల్లెట్ బిస్కెట్లనే కాకుండా సూక్ష్మ, చిన్న =తరహా పరిశ్రమల ద్వారా తయారుచేసే వివిధ రకాల సబ్బులు షాంపూలు, కరక్కాయ పౌడర్ తేనె, న్యూట్రిమిక్స్ ఉత్పత్తులు గిరిజనులకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్త్తున్నారు. వీటిని బహుళ ప్రాచుర్యంలోకి తేవడానికి ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో, హైదరాబాద్‌లోని గవర్నర్ రాజ్‌భవన్‌లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇండియా సాంసృ్కతిక వైవిధ్యం సౌత్ ఆఫ్ ఇండియా నేపథ్యంలో భాగంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మోటా సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆదివాసి గిరిజన మహిళల వివిధ రకాల ఉత్పత్తులు వాటి వలన కలుగు ప్రయోజనాలు,ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు , ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తేవడం కోసం ఐటిడిఎ భద్రాచలం నుండి మూడు ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సంబంధించిన సిబ్బందిని వారు తయారుచేస్తున్న ఉత్పత్తులతో పాటు ఢిల్లీకి పంపించారు. శ్రీరామ జాయింట్ లియాబిలిటీ గ్రూప్‌నకు చెందిన మిల్లెట్ బిస్కెట్ తయారీ మహిళలు వెంకటలక్ష్మి, లలిత, మంగవేణి, సమ్మక్కలను ఈ సందర్బంగా ప్రధాని అభినందించారు.

మహిళలకు భద్రాద్రి కలెక్టర్ అభినందన
భద్రాచలం పట్టణంలోని శ్రీరామ జాయింట్ లియాబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్‌ను కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ ఆదివారం సందర్శించి అక్కడి మహిళలను అభినందించారు. ఇక్కడ తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయి వరకు వెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , ఐటిడిఎ భద్రాచలం పేరును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందని, అందుకు మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఎటువంటి కల్తీ లేని ఆర్గానిక్ తినుబండారాలు తయారు చేసి గిరిజన మ్యూజియం , శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంనకు వచ్చే భక్తులకు అందించాలని అన్నారు.

మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు, నెయ్యి ఇతర వస్తువులు బయట నుండి కాకుండా మన పంట పొలాలలో రాగులు సజ్జలు పండించుకొవాలని, నెయ్యిని మాత్రం మన గ్రామాలలోనే పశుసంపద ఎక్కువగా ఉన్నందున స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేసుకోవాలని మహిళలకు సూచించారు. అలాగే మిల్లెట్ బిస్కెట్లకు సంబంధించిన బ్రాండింగ్ స్టిక్కర్లు సెలెక్ట్ చేసి ఐటిడిఎకు మంచి గుర్తింపు వచ్చేలా చూడాలని అన్నారు. అనంతరం మిల్లెట్ బిస్కెట్ తయారీ గ్రూప్ మహిళలు ప్రపంచమంతటా భద్రాచలం ఐటిడిఏ తరపున మిల్లెట్ బిస్కెట్ల తయారీకి సంబంధించిన అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతగా పిఓ ఛాంబర్‌లో ఐటిడిఎ పిఒ బి రాహుల్, ఏఎస్‌పి విక్రాంత్ కుమార్ సింగ్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మకు మిల్లెట్ బిస్కెట్లను అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News