Saturday, July 27, 2024

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 12న కేసరపల్లి ఐటి పార్కు ప్రాంగణంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. 12వ తేదీ ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారన్నారు.

ఉదయం 10.55 గం.లకు అక్కడ నుంచి ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని ఉ.11 నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.40 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12.45 గం.లకు విమానంలో భువనేశ్వర్ బయల్దేరి వెళ్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News