Tuesday, May 7, 2024

108, 102 అంబులెన్స్‌లను ప్రారంభించిన స్పీకర్

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటి, బాన్సువాడ గ్రామీణ మండలానికి మంజూరైన రెండు 108 అంబులెన్స్ వాహనాలు, బీర్కూర్ మండలానికి కేటాయించిన 102 అంబులెన్స్ వాహనాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉదయం పట్టణంలోని తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అవసరమైన వాహనాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ఆయా మండలాల పరిధిలో అందుబాటులో ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియాస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, నాయకులు పిట్ల శ్రీధర్, ఎర్వల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాజ్, కిరణ్, రఫి, నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News